సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు, సరదా స్కిట్‌లు హైలైట్‌గా నిలిచాయి. అలనాటి తార జమున, ప్రభ, రోజారమణి, నటి`దర్శకురాలు జీవిత, నటులు రాజేంద్రప్రసాద్‌, రాజశేఖర్‌, బాబూమోహన్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌, కార్తికేయ, రాంకీ, విష్వక్‌సేన్‌, నేటి తారలు శ్రియ, శివానీ, శివాత్మిక, నటాషా దోషి, అవికా గోర్‌, దీప్తి సునయన, ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌, అంబికా కృష్ణ, దిల్‌ రాజు, తమిళ హీరో జయం రవి, కన్నడ నటుడు, ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, తమిళ వెటరన్‌ యాక్ట్రెస్‌ కుట్టి పద్మిని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంగీత దర్శకుడు తమన్‌, గాయకుడు అనురాగ్‌ కులకర్ణి తదితరులు ఈ వేడుకకు అమితమైన ఆకర్షణ తీసుకొచ్చారు.


డాక్టర్‌ రాజశేఖర్‌, జయం రవి చేతుల మీదుగా శ్రీదేవి స్మారక అవార్డును శ్రియ అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీదేవి మేడం పాటలు ఎప్పుడూ వింటూ ఉంటా. ఆమె అందరికీ ఇన్సిపిరేషన్‌. మా అమ్మ ముందు ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్‌ అవార్డు. మరిన్ని మంచి సినిమాలతో మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు.


రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘శ్రీదేవి గారి పేరిట ఒక అవార్డు.. మా చేతుల మీదుగా ఇవ్వడం ఆనందంగా ఉంది. శ్రీదేవి గారు ఎంతమంచి యాక్టరో శ్రియ కూడా అంతమంచి యాక్టర్‌. శ్రియలో శ్రీదేవి గారి పోలికలు ఉంటాయి. అలాగే మా పెద్దమ్మాయిలో కూడా శ్రీదేవి గారి పోలికలు ఉంటాయి. సురేష్‌ గారు 17 ఏళ్లుగా ఈ వేడుకలు చేస్తున్నారు. నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేను సంతోషం అవార్డ్స్‌ ఈవెంట్‌కు రావడం ఇదే తొలిసారి. సంతోషం సురేష్‌ గారికి కంగ్రాట్స్‌’’ అన్నారు.
జీవిత మాట్లాడుతూ.. ‘‘శ్రీదేవి గారి గురించి మాట్లాడ్డానికి మాటలు చాలవు. ఆమె అతిలోక సుందరి. ఆమెకు రీప్లేస్‌ మెంట్‌ లేదు. ఈ అవార్డు శ్రియకు ఇవ్వడం 100 శాతం కరెక్ట్‌’’ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: