హీరోగానే కాదు నిర్మాతగా కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన సత్తా చాటుతున్నాడు. నిర్మాతగా రాం చరణ్ బాగా అనుభవం ఉన్నవాడిగా చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఖైది నంబర్ 150 సినిమా చేసిన రాం చరణ్. ఆ తర్వాత సైరా సినిమా చేశాడు. సైరా తర్వాత కొరటాల శివ, చిరు సినిమాను కూడా రాం చరణ్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.    


ఇదిలాఉంటే రాం చరణ్ మళయాళ సినిమా లూసిఫర్ రీమేక్ రైట్స్ తీసుకున్నాడన్న విషయం తెలిసిందే. పృధ్వి రాజ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్ లీడ్ రోల్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేశారు. కాని పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఎవరికి రీచ్ అవలేదు. అసలు ఈ సినిమా వచ్చింది వెళ్లింది చాలామందికి తెలియదు.   


ఈమధ్య లూసిఫర్ సినిమా చూసిన రాం చరణ్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. వెంటనే రీమేక్ రైట్స్ తీసుకున్నారట. అయితే ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ తో చరణ్ సినిమా కొన్నాళ్లుగా వార్తల్లో ఉంది. చరణ్ నిర్మాణంలో పవన్ లూసిఫర్ సినిమా చేస్తాడని టాక్.


ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే పవన్ తర్వాత సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆయన్ను మళ్లీ సినిమాల్లో చూడాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం కథా చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: