టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై దాదాపుగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న లేటెస్ట్ విజువల్ వండర్ మూవీ సైరా నరసింహారెడ్డి. రాయలసీమలోని రేనాడు ప్రాంతానికి చెందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా భారీ స్టార్ కాస్ట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, శాండిల్ వుడ్ నటుడు కిచ్చ సుదీప్, అలానే భోజ్ పురి నటుడు రవి కిషన్, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు, 

హీరోయిన్లు నయనతార మరియు తమన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనుష్క శెట్టి మరియు నిహారిక కొణిదెల ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నో అంచనాల మధ్య రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది మాత్రం అద్భుతమైన విజువల్స్ మరియు ఎంతో గ్రాండియర్ గా వేసిన అద్భుతమైన సెట్టింగులు. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా రాజీవన్ ని తీసుకోవడం జరిగింది. గతంలో పలు హిందీ, తమిళ మరియు తెలుగు సినిమాలకు పని చేసిన రాజీవన్, తొలిసారి ఇంతటి భారీ చిత్రానికి పని చేస్తుండటంతో సెట్టింగ్స్ పై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. 

అలానే ఆ భారీ సెట్టింగులు కోసం ఖర్చు కూడా బాగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సెట్టింగ్స్ తో పాటు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రత్నవేలు కూడా ఎంతో గ్రాండియర్ గా విజువల్స్ ని అందించినట్లు తెలుస్తోంది. మంచి కథ, కథనాలతో పాటు ప్రేక్షకుడిని కదిలించే ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాలో మెండుగా ఉన్నట్లు సమాచారం. మరి ఎంతో భారీ ఖర్చుతో ఇంతటి అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో తెలియాలంటే మాత్రం రేపటి వరకు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: