ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ఫీవర్ నడుస్తుంది. సైరా నరసింహా రెడ్డి సినిమా రిలీజ్ కోసం ఎదురు చేసే ఫాన్స్ కి  ఇటీవలే విడుదలైన టీజర్, రెండు ట్రైలర్స్ కాక పుట్టించాయి.ఈ టైం లో ఓ సైరా'  అంటూ సాగే వీడియో సాంగ్‌ విడుదల చేసి  మరో సెన్సేషన్‌కి తెరలేపారు మేకర్స్.ఇంకేముంది ఈ సాంగ్‌లో తమన్నా పర్‌ఫార్‌మెన్స్ అభిమానుల నోట మాట రావట్లేదు.  మరో పక్క  అబ్బురపరిచే విజువల్స్ నడుమ గుర్రపు స్వారీ చేస్తూ ధీరుడిగా మెగాస్టార్ ఎంట్రీ చూస్తే పిచ్చ్చేక్కిపోతుంది.ఇంకా ఈ సాంగ్‌లో చూపించిన కొన్ని యుద్ధ సన్నివేశాలు మెగా అభిమానుల్లో సరికొత్త జోష్ నింపడమే కాకా ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉందని అనిపిస్తుంది.

ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్ ఎక్కడ చూసిన ఈ పాటె దర్శనమిస్తు  నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతూ రికార్డు స్థాయిలో వ్యూస్
రాబడుతోంది.ఓ సైరా' అంటూ యుద్ధ వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్పతనాన్ని తెలుపుతూ సాగిపోతున్న ఈ వీడియో సాంగ్ ట్రెండ్ అవుతోంది. సైరా నరసింహా రెడ్డి' సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమాపై హైప్ పెంచేశాయి. ఆన్‌లైన్ వేదికలపై మోగిపోతున్న 'సైరా' నినాదం చూస్తుంటే.. ఇక విడుదలయ్యాక ఈ మూవీ సృష్టించే సంచలనాలు ఊహించలేం అంటున్నారు విశ్లేషకులు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ.  తెలుగుతో పాటు హిందీ వర్షన్ లోనూ ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడటంతో థియేటర్ల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఒక పక్క ప్రీబుకింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి ఈ మూవీ టికెట్స్.హిందీలో దాదాపు 2000 థియేటర్స్ కేటాయించారని సమాచారం.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ.ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైరా నరసింహ రెడ్డి  గురువుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించగా.... నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఇక రేపే అన్ని థియేటర్లలో సైరా సమరం మోగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: