అలనాటి తార జమున, ప్రభ, రోజారమణి, నటిదర్శకురాలు జీవిత, నటులు రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, బాబూమోహన్, సునీల్, వెన్నెల కిశోర్, నేటి తారలు శ్రియ, శివానీ, శివాత్మిక, దీప్తి సునయన, ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్బాబు, అల్లు అరవింద్, అంబికా కృష్ణ, దిల్ రాజు, తమిళ హీరో జయం రవి, సంగీత దర్శకుడు తమన్, గాయకుడు అనురాగ్ కులకర్ణి తదితరులు ఈ వేడుకకు ఆకర్షణగ నిలిచారు. ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి సీనియర్ హాస్యనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ చేతుల మీదుగా ఫిల్మ్ జర్నలిజంలో లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు సొంతం చేసుకున్నారు.
‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్టు అవార్డును జమున చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ కు లభించింది. ఈ అవార్డు రావడానికి కారణమైన ఆ పాత్రను సృష్టించిన రచయితలు, దర్శకులు కు అభినందనలు తెలిపారు. వాళ్లిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపర్చుకున్నాను. జమున మాట్లాడుతూ ‘‘అరవింద్, సురేశ్బాబు నా బిడ్డల్లాంటి వాళ్లు.. సినిమా పరిశ్రమ మెచ్చుకొనే నిర్మాతలుగా ఉండడం నాకు చాల ఆనందదాయకం అని తెలిపారు.
ఇక యాంకర్లుగా ఉదయభాను, సమీర్, తనీష్, తేజస్విని మదివాడ వ్యవహరించిన ఈ వేడుకలో కామెడీ హీరో సంపూర్ణేష్బాబు, హీరోయిన్లు నభా నటేష్, అవికా గోర్, నటాషా దోషి, తేజస్విని, దీప్తి సునయన చేసిన డాన్స్ పర్ఫార్మెన్సులు, సింగర్స్ రఘురామ్, శ్రుతి, గాయత్రి పాటలు, ఉప్పల్ బాలు పర్ఫార్మెన్స్ అందరిని అలకరించాయి.