టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి ఎన్నో అంచనాల మధ్య రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ సరసన తొలిసారి నయనతార హీరోయిన్ గా జోడి కడుతున్న ఈ సినిమాలో అనుష్క, నిహారిక లు ప్రత్యేక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, శాండల్ వుడ్ నటుడు కిచ్చ సుదీప్, భోజ్ పురి నటుడు రవికిషన్, టాలీవుడ్ దిగ్గజ నటుడు జగపతి బాబు, 

నటి తమన్నా లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దాదాపుగా రూ.250 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించడం జరిగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై ఆయా భాషల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి చిరకాల మిత్రుడు అయిన కలెక్షన్ కింగ్ కళాప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు, 

నేడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సైరా పై తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. 'నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. టీమ్ మొత్తానికి బెస్ట్ ఆఫ్ లక్' అంటూ మోహన్ బాబు గారు పోస్ట్ చేయడం జరిగింది. కాగా మోహన్ బాబు గారు చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: