మెగా ఫామిలీ నుండి ఎందరో హీరోలు ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. అల్లువారి వారసుల్లో ఒకడైన అల్లు శిరీష్ హీరోగా కెరీర్ ప్రారంభించి ఇప్పటికే చాలా కాలం అయ్యింది.
కె. రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవం చిత్రంతో తెలుగు తెర కు ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతో మెగా అభిమానుల్లో ఎన్నో అంచనాలతో వచ్చిన శిరీష్ సినిమా సినిమాకు తన స్టార్డంను తగ్గించుకుంటున్నాడు.
మెగా అనే ఒక ట్యాగ్ ఉండటం వల్ల ఈయన కెరీర్ ఇప్పటిదాకా అలా అలా ముందుకు సాగుతుంది. ఇటీవల ఈయన చేసిన ఏబీసీడీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడి నిరాశపరిచింది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్న కారణంగా శిరీష్ సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాకు రీమేక్ గా తెలుగులో ఏబీసీడీ వచ్చి ఏడాది కాబోతున్న నేపథ్యంలో తదుపరి చిత్రం విషయమై చర్చలు స్పీడప్ చేశాడు.
సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
శిరీష్ తర్వాత సినిమా దాదాపుగా ఖరారు అయినట్లుగా సమాచారం అందుతోంది. ఏబీసీడీ చిత్రంను ఒక కన్నడ మూవీ నుండి రీమేక్ చేశాడు. ఇప్పుడు శిరీష్ తర్వాత సినిమాను కూడా ఒక తమిళ మూవీ నుండి రీమేక్ చేయబోతున్నాడు. తమిళంలో ఒక యువ దర్శకుడు తెరకెక్కించిన మూవీ సక్సెస్ అయ్యింది. ఆ మూవీని తెలుగులో అదే దర్శకుడి దర్శకత్వంల రీమేక్ చేయాలని అల్లు శిరీష్ నిర్ణయించుకున్నాడు.
అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమాను మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరో వైపు గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా అల్లు శిరీష్ మంచి గుర్తింపు ఉంది.