బిగ్ బాస్ లో మంగళవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రాళ్ళే రత్నాలు అన్న టాస్క్ లో తక్కువ విలువ గల రాళ్ళు సంపాదించి నలుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.రాహుల్, పునర్నవి, మహేష్, వరుణ్ ల లో ఇంటి నుండి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి గమనిస్తే, ముఖ్యంగా మహేష్ టాస్క్ లో అందరి మీద అరిచి చాలా పెద్ద తప్పు చేశాడు.


మహేష్ తో స్నేహంగా ఉండే బాబా భాస్కర్ పైన కూడా సీరియస్ అయ్యాడు.అయితే చాలా రోజులుగా బాబా భాస్కర్,కి మహేష్ కి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇద్దరూ ఇంతకుముందు ఉన్నంత స్నేహంగా ఉండలేకపోతున్నారు. బాబా భాస్కర్ శ్రీముఖితో స్నేహంగా ఉండడం, అలాగే మహేష్ ఇతర సభ్యులతో కలివిడిగా ఉండడం ఇద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇలా ఉండడం వల్ల మహేష్ కే ఎక్కువ నష్టం అని చెప్పాలి.


అయితే అది మహేష్ తన చేజేతులా చేసుకున్నాడు. రాళ్ళే రత్నాలు అన్న టాస్క్ లో బాబా భాస్కర్ మీద సీరియస్ అవడం వల్ల మహేష్ పై ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెరిగింది. బాబా భాస్కర్ అభిమానులు కూడా మహేష్ ని చీదరించుకుంటున్నారు. దీని ప్రభావం ఎలిమినేషన్ పై చాలా ఉండనుంది.  వీరిద్దరూ స్నేహంగా ఉన్నపుడు బాబా అభిమానుల ఓట్లు మహేష్ కి పడేవి. కానీ ఇప్పుడు అది కుదరదు.


కాబట్టి మహేష్ చేసిన ఆ ఒక్క తప్పు అతన్ని ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఎలిమినేషన్ రేసులో పునర్నవి కూడా ఉన్నప్పటికీ మహేష్ ఎలిమినేట్ అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది. మరి ముందు ముందు ఎపిసోడ్ లలో హౌస్ మెంబర్స్ తో, ముఖ్యంగా బాబా భాస్కర్ తో అతని బిహేవియర్ సరిగ్గా ఉంటే ఎలిమినేషన్ నుండి బయటపడగలడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: