మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు తదితర ఇతర నటులు నటించారు. టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని సాధారణ ప్రేక్షకులు సహా మెగా ఫ్యాన్స్ అందరూ భావించారు. 

అయితే నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వినపడుతోంది. సినిమాలో అన్నిటికంటే పెద్ద హైలైట్ మెగాస్టార్ పెర్ఫార్మన్స్ అని అంటున్నారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన అదరహో అనే రేంజ్ లో ఉందట. ఇక సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ని మెగాస్టార్ తనదైన శైలిలో ఎంతో అద్భుతంగా పలికారని, ఇక కీలకమైన క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని అంటున్నారు. మొదట్లో మెల్లగా ప్రారంభమయిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోదని, అలానే ఫస్ట్ హాఫ్ అంతా సాధా సీదాగానే సాగుతుందని అంటున్నారు. కానీ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ గా వచ్చే అండర్ వాటర్ ఫైట్ మాత్రం బాగుంటుందని చెప్తున్నారు. 

ఇక సెకండ్ హాఫ్ మొదట్లో కొంత సాగతీతగా అనిపించినా, మెల్లగా పుంజుకుని ముందుకు సాగుతుందని, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ గా వచ్చే వార్ సీక్వెన్స్ సినిమా హైలైట్స్ లో ఒకటని చెప్తున్నారు. ఇక క్లైమాక్స్ కూడా బాగుందని, అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాపై మరింత శ్రద్ధ కనపరిచి, సినిమా లెంగ్త్ కొంత తగ్గించి ఉంటె బాగుండేదని అంటున్నారు. ఏది ఏమైనా సైరాలో సింహభాగం విజయం మెగాస్టార్ కె దక్కుతుందని, అయితే డైరెక్టర్ అనే వాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అంటారు కాబట్టి, అతడికి కూడా కొంత దక్కుతుందని అంటున్నారు.మరి మున్ముందు సైరా సినిమా ఎంత మేర కలెక్షన్ ని రాబడుతుందో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: