స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో నటిస్తున్న సినిమా  ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలోని ‘సామజవరగమన’ అనే పాటను చిత్రబృందం ఇటీవల రిలీస్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఒక మంచి మెలోడియస్ పాటలలో ‘ఉండిపోరాదే’ అంటూ తన మెలోడియస్ వాయస్‌తో యూత్‌ను మెస్మరైజ్ చేసిన సిద్ శ్రీరామ్‌ ఈ పాటను ఆలపించారు.ఇక అల వైకుంఠపురంలో ఈ పాట కూడా  ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు..నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు’  శ్రీరామ్‌ ఆలపించారు.

ఇటీవల ఈ పాటకు విపరీతమైన రెస్పాన్స్ ఉంది . ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చక్కటి లిరిక్స్ అందించారు ఈ పాటకి. కానీ ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్‌పై కామెంట్స్ చేస్తున్నారు సింగర్ కళ్యాణి మాలిక్. సిద్ శ్రీరామ్ తప్పుగా పాడాడంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నువ్వు పాటలోని పదాలను పలికిన తీరుకు చప్పట్లు కొడుతున్నాను.


ఇప్పుడు నువ్వు స్టార్ సింగర్‌వి కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ నువ్వు ‘మహా ప్రసాదం’ అన్న పదాన్ని తప్పుగా పలికిన కూడా  నిన్ను సింగర్‌గా పెట్టుకున్నారు. 
ఇక లిరిక్స్‌కు విషయానికి వస్తే  నేను నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని వెటకారంగా కామెంట్ చేశాడుసింగర్ . పాటలోని ‘మహా ప్రసాదం’ అనే లిరిక్‌ను సిద్ శ్రీరామ్ వినలేనంత ఘోరంగా పలికారని కళ్యాణి కూడా కామెంట్ చేశారు.

అయితే ఈ కామెంట్ చేసిన కొద్దిసేపటికే ఆయన పోస్ట్ తీసేయడం కూడా చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ పాటకు, సిద్ శ్రీరామ్‌కు ఎక్కువ పాపులారిటీ వస్తుండడం వల్ల కళ్యాణి  ఓర్వలేకే ఈ కామెంట్స్ పెట్టారు అని పలువురు నెటిజన్లు వెల్లడిస్తునారు.



మరింత సమాచారం తెలుసుకోండి: