మాస్ మహారాజ్  రవితేజ ,  గోపిచంద్ మలినేని  కాంబినేషన్ లో రానున్న  మూడో చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్  లో వున్న ఈ చిత్రం  త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో శృతి హాసన్  హీరోయిన్ గా నటించనుంది. 



ఇక  ఇంతకుముందు వెంకీ ,విక్రమార్కుడు ,కిక్ , మిరపకాయ్ , పవర్ ,టచ్ చేసి చూడు చిత్రాల్లో రవితేజ  పోలీస్ ఆఫీసర్ గా నటించగా  ఒక్క టచ్ చేసి చూడు తప్ప మిగితా అన్ని  సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి ఇప్పుడు  మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్ర రవితేజ కు కలిసివస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  డైరెక్షన్ లో  'డిస్కోరాజా' లో నటిస్తున్నాడు.  ఈచిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. దసరా కానుకగా  ఈ చిత్రం యొక్క టీజర్ ను  విడుదలచేయనున్నారు. 



సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో   నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా  హోప్  కథానాయికలుగా నటిస్తున్నారు.  ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ ఫై  రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో  బాబీ సింహ  విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.  క్రిస్మస్ కానుకగా   డిసెంబర్ 20న  ఈ చిత్రం విడుదలకానుంది.  ఇక ఇటీవల వరుస పరాజయాలతో రవితేజ మార్కెట్ దారుణంగా పడిపోయింది. దాంతో రవితేజకు  ఈ చిత్ర విజయం కీలకం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: