మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసిం హా రెడ్డి సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ అంతా మెగాస్టార్ నట విశ్వరూపానికి పూనకాలు వచ్చినట్టు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. సురేందర్ రెడ్డి టేకింగ్ బాగున్నా సీన్ టూ సీన్ క్లారిటీ మిస్సైనట్టు చెప్పుకుంటున్నారు.


రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి పాత్రల్లానే రాం చరణ్ కోసం కూడా ఓ పాత్ర అనుకున్నారట. కాని చివరి నిమిషంలో ఆ పాత్రని వద్దని అనుకున్నారట. రన్ టైం ఎక్కువవుతుందన్న కారణంతోనే సైరా నుండి చరణ్ ఎపిసోడ్ తీశారట.


సినిమాలో చరణ్ ఉండి ఉంటే ఆ లెక్క వేరేలా ఉండేది. అయితే చరణ్ ఇమేజ్ ను ఓ చిన్న సీన్ కోసమే.. లేక ఓ పాత్ర కోసమో వాడటం కరెక్ట్ కాదని అనుకున్నారు అందుకే సినిమా మధ్యలోనే ఆ రోల్ వద్దని అనుకున్నారట. ఇక సైరా సినిమాలో క్లైమాక్స్ మూవీ చూసి మెగా ఫ్యాన్స్ కొందరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.


హీరో చనిపోతే తెలుగు ప్రేక్షకులు సహించలేరు.. అలాంటిది మెగాస్టార్ తల నరకడం దాన్ని ఉరికి వేలాడతీయడం వంటి ఎపిసోడ్స్ మెగా ఫ్యాన్స్ ను కాస్త ఇబ్బంది పెట్టాయి. అయితే కథ అలాంటిది కాబట్టి దాన్ని ఒప్పుకోక తప్పదు. కాని కొందరు హార్ట్ కోర్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిని అలా చూడలేకపోయారు. సినిమాలో చరణ్ తో పాటుగా నటించిన పరభాష నటీనటులు కూడా మెప్పించారు. ఇక హీరోయిన్స్ నయనతార, తమన్నాలు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: