గత రెండు-మూడేళ్ళుగా బాలీవుడ్ హీరోల తో పాటు దర్శక, నిర్మాతల చూపు తెలుగు సినిమాల కథల పై పడింది. మన టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నాయి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రేంజ్ మొత్తంగా మారిపోయింది. అంతేకాదు ఈ సినిమాలో షాహిద్ కి జంటగా నటించిన కియారా అద్వాని ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఇలా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న వాటిలో 'జెర్సీ, ఆర్ఎక్స్100' సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇంకో తెలుగు సినిమాని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని లేటెస్ట్ న్యూస్. బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం 'ఇస్మార్ట్ శంకర్' సినిమా కూడా రీమేక్ హిందీలో రీమేక్ కాబోతోందట. 

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 75-80 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి సెన్షేషన్ ని క్రియోట్ చేసింది. దాంతో ఈ సినిమా రెట్టింపు లాభాలను సొంతం చేసుకుంది. మొత్తానికి, ఇస్మార్ట్ శంకర్ పూరికి అలాగే హీరో రామ్ కి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మరి రణబీర్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి. 

ఇక పూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ తో ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రస్తుతం గోవా లో ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక మరో వైపు పైసా వసూల్ తో మంచి కాంబినేషన్ అనిపించుకున్న పూరీ-బాలయ్య కాంబోలోను ఒక సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. 


మరింత సమాచారం తెలుసుకోండి: