మెగాస్టార్ సైరా మూవీ గాంధీ జయంతి రోజున భారీ ఎత్తున రిలీజయింది.  దసరా సెలవులు కావడంతో సినిమాను ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ పదిరోజులపాటు సినిమాకు కలెక్షన్లు ఉంటాయి.  అయితే, సినిమాకు మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది. సైరా ఎవరూ ఊహించని విధంగా హిట్ అవుతుందని అనుకున్నారు.  కానీ, ఏమైందో ఏమో తెలియదుగాని, సినిమాకు భారీ దెబ్బపడింది.  తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించినా.. బాలీవుడ్ లో మాత్రం సినిమాకు పెద్దగా వసూళ్లు దక్కలేదు.  


కాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను మెగాబృదం ఈరోజు నిర్వహించింది.  ఈ ప్రెస్ మీట్ కు మెగాస్టార్ తో పాటు యూనిట్ అంతా హాజరయ్యారు.  అందరూ మాట్లాడారు.  సినిమాను ఆకాశానికి ఎత్తారు. చివర్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి మాట్లాడారు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున చెప్తూ వారి పాత్రల గురించి వివరిస్తూ వారి పడిన కష్టం గురించి చెప్పుకుంటూ వెళ్లారు. 

అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్నా, అనుష్క ఇలా అందరి గురించి చెప్పారు.  టెక్నిషియన్స్ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.  టెక్నిషియన్స్ సినిమాకు ఎంతవరకు సపోర్ట్ చేశారో చెప్పుకొచ్చారు.  సినిమాకు డిజైనర్ గా పనిచేసిన సుష్మిత గురించి ప్రత్యేకంగా చెప్పారు.  మొదటిసారి కూతురుని ప్రెస్ మీట్ కు తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.  అందరి గురించి చెప్పిన మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ను మర్చిపోయారు.  పవన్ గురించి కూడా రెండు మాటలు చెప్పి ఉంటె బాగుండేది.  


పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ప్రచార చిత్రంలో వాయిస్ ఇచ్చారు.  సినిమాలో కూడా వాయిస్ ఇచ్చారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యి మెగాస్టార్ గురించి, ఇలాంటి సినిమాలు ఎందుకు తీయాలనే దాని గురించి చెప్పారు.  అన్నయ్యపై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు.  అంతా బాగుంది అయితే, పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం కేరళలో ఉన్నారు.  మరో నెల వరకు అందుబాటులో ఉండరు.  పవన్ సైరా సినిమా రిలీజ్ తరువాత మెగాస్టార్ గురించి రెండు చిన్నమాటలు ట్వీట్ చేసి వెళ్లుంటే బాగుండేది కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: