మొన్న ‘అర్జున్ రెడ్డి ....నిన్న
జెర్సీ, ఆర్ఎక్స్100 ఇలా తెలుగు
సినిమాల రైట్స్ కొనే పనిలో పడ్డారు
బాలీవుడ్ నిర్మాతలు. మన వాళ్ళ కథలు, కేప్షన్లు నచ్చడంతో ఈ మధ్య బాలీవుడ్ నిర్మాతల చూపు తెలుగు సినిమాల పై పడింది. ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి క్యూ కడుతున్నాయి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు.
సెన్సేషనల్ హీరో
విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కబీర్ సింగ్ భారీగా హిట్టై వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో
నాని హీరో గా వచ్చిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ సినిమాల రైట్స్ ను కూడా కొనేశారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత
కరణ్ జోహార్ సొంతం చేసున్నట్టు తెలిసింది. ఇలా తెలుగులో హిట్టయ్యే సినిమాల కోసం కాసుకొని కూర్చున్నారు హిందీ నిర్మాతలు.
ఇదే అదునుగా మరో తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం కూడా రీమేక్ సిద్ధమవుతోంది. క్లాస్ హీరో రామ్ ని ఊర మాస్ గెట్టప్ లో – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమా ఇస్మార్ట్ శంకర్.
నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఆడియోకి సూపర్ రెస్పాన్డ్స్ వచ్చింది.
దాంతో ఈ చిత్రం ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాలు కలెక్షన్స్ తో కళ కళలడాయి. హిందీ స్టార్ హీరో
రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
రామ్ పాత్రలో
రణబీర్ కపూర్ మాస్ యాక్షన్తో నటించి మెప్పించగలడా? మరి
రణబీర్ కపూర్ కి కూడా ఇస్మార్ట్ సూపర్ హిట్ ని ఇస్తుందా..? ఈ న్యూస్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.