యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. గత ఏడాది తాను రవికుమార్ దర్శకత్వంలో నటించిన జైసింహా చిత్రం మంచి విజయవంతం అవడంతో, మరొక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. సి కళ్యాణ్ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తుండగా మరొక హీరోయిన్ భూమిక ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. 

ఇకపోతే ఈ సినిమా తరువాత బాలయ్య, బోయపాటి సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంతటి అత్యద్భుత విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. అయితే త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఒక మంచి పవర్ఫుల్ కథతో తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాక సింహ, లెజెండ్ మాదిరి ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు రకాల పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే అందులో ఒక పాత్ర కోసం బాలయ్య తన వెయిట్ ని చాలావరకు, అంటే దాదాపుగా 25 కిలోల మేర తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారట. 

అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించి, వారిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలోని హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాను బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట దర్శక, నిర్మాతలు. మరి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: