తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.  ఇక రెండో సీజన్ కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3 కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు.  అయితే బిగ్ బాస్ సీజన్ 1 లో నటి అర్చన (వేద) ఇంటి సభ్యురాలిగా చివరిదాగా కొనసాగుతూ వచ్చింది.  అప్పట్లో అర్చన కు ఫ్యాన్స్ పెద్ద పెద్ద కటౌట్స్ కట్టి గెలిచేందుకు కృషి చేశారు.  మొత్తానికి ఆ సీజన్ శివబాలాజి విన్నర్ గా నిలిచారు. 

అర్చన పలు సినిమాల్లో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.  తాజాగా ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో టాలీవుడ్ నటి అర్చన (వేద) నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి నటులు నవదీప్, శివబాలాజీ, సుమంత్, నటి మధుమిత తదితరులతోపాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అర్చన చేతివేలికి జగదీష్ వజ్రపు ఉంగరం తొడిగాడు.

ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కున్న తర్వాత వేద తల్లిదండ్రులు విజయ శాస్త్రి-సుధాకర్ శాస్త్రి, జగదీశ్ తల్లిదండ్రులు ప్రతిభ-భక్తవత్సలం దంపతులతోపాటు కార్యక్రమానికి హాజరైన బంధువులు, స్నేహితులు వారిని ఆశీర్వదించారు. గత నెలలోనే ప్రియుడు జగదీశ్‌తో కలిసి దిగిన ఫొటోను అర్చన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. 2004 లో అల్లరి నరేష్ నటించిన ‘నేను’ అనే సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. అర్చన తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌ వన్‌ తో మంచి క్రేజ్ సంపాదించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: