టాలీవుడ్ లో ఇప్పటికి ఎన్నో సినిమాలను నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఎంతో మంది  గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను తెరకెక్కించారు. కొన్ని కొన్ని సినిమాలు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కగా ... మరి కొన్ని  సినిమాలు  కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంటాయి . ప్రస్తుతం ఒక సంఘటన ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసా... షీనాబోరా   హత్యోదంతం ఘటన. కొన్నాళ్ల క్రితం ముంబై కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఇప్పుడు సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు . 

 

 

 

 

 

 

 

 కొన్నాళ్ల క్రితం మీడియా ప్రముఖులైన ఇంద్రాణీ ముఖర్జీయా  తన కన్న కూతురైన షీనాబోరా ను అతి  కర్కశంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైనం అందరిని నివ్వెరపోయేలా చేసింది. అయితే ఈ హత్య కేసులో జైలు పాలైన ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుతం  జైలు జీవితాన్ని గడువుతుంది. అయితే ఇప్పుడు ఈ హత్య సంఘటనను తెలుగులో సినిమాగా  రూపొందించనున్నారు. అయితే ఈ సినిమాలో ఇంద్రాణి ముఖర్జియా  పాత్రలో  ప్రముఖ నటి అందాల భామ రాయ్  లక్ష్మి నటించనుంది. అయితే విలనిజంతో సాగే ఈ పాత్రను తనకు  దక్కడం పట్ల రాయ్ లక్ష్మి  సంతోషం వ్యక్తం చేసింది.

 

 

 

 

 

 తనకి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలని ఎప్పటినుండో  కోరిక ఉండేదని... అయితే ఇప్పటి వరకు రకరకాల పాత్రలు చేసినప్పటికీ... ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర మాత్రం ఇప్పటివరకు రాలేదని అందుకే ఇలాంటి పాత్ర తనకు దక్కడం సంతోషంగా ఉందంటూ రాయ్ లక్ష్మీ ఆనందం వ్యక్తం చేసింది. నెగిటివ్ ఛాయలతో కొనసాగే ఈ ఈ పాత్రలో నటిస్తుండడం ఎక్సైటింగ్ గా ఉందని... ఇలాంటి పాత్ర కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నానని రాయ్  లక్ష్మీ  తెలిపారు. మర్డర్ మిస్టరీ గా రూపొందే ఈ చిత్రానికి దర్శకుడు స్వరాజ్  తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: