మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా బుధవారం రిలీజై సక్సెస్ అందుకుంది. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు. సినిమా కొన్నిచోట్ల మిక్సెడ్ టాక్ రాగా వసూళ్ల విషయంలో జోరు కొనసాగిస్తుంది. రిలీజ్ తర్వాత కూడా సైరా ప్రమోషన్స్ ఇంకాస్త పెంచారని చెప్పొచ్చు.


రిలీజ్ నెక్స్ట్ డేనే సినిమా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన చిత్రయూనిట్ లేటెస్ట్ గా స్పెషల్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేస్తున్నారు. సినిమా క్రేజ్ ను అందిరికి తెలిసేలా మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రం ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రం, చిరు సినిమా గురించి చిట్ చాట్ అంటే కచ్చితంగా సినిమాకు ప్లస్ అయినట్టే.


ఓ విధంగా కలక్షన్స్ పెంచేందుకు కూడా ఈ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చినా ఖైది నంబర్ 150తో సత్తా చాటిన చిరంజీవి సైరాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను రాం చరణ్ నిర్మించాడు. రాం చరణ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. 


స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా త్రివిక్రం ఇంటర్వ్యూయర్ కాగా సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి ప్రస్థావిస్తారని తెలుస్తుంది. త్రివిక్రంతో చిరు ఇంటర్వ్యూ అనగానే మెగా ఫ్యాన్స్ అంతా ఆ ఇంటర్వ్యూ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న త్రివిక్రం సత్తా చాటాలని చూస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.  పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్ కూడా నటిస్తున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: