ఇండస్ట్రీలో నటులను తమ అభిమానులు సినిమా పేర్లతో పిలవడం చూస్తూనే ఉంటాం.మిల్కీ బ్యూటీ తమన్నా ని చాల మంది  అవంతికి, నిహారిక అంటూ ఆమె  సూపర్ సినిమాల పాత్ర పేరుతో ముద్దుగా పిలుచుకుంటుంటారు.ఈ మధ్య  సైరాలో లక్ష్మీ పాత్రలో తమన్నా నటనకు అన్ని వైపుల నుంచి మంచి స్పందన రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.   సైరా  థ్యాంక్యూ మీట్  కార్యక్రమంలో తమన్నా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ఈ సినిమాకి పనిచేసిన అందరికి థాంక్స్ చెప్పింది. 


లక్ష్మి పాత్రలో తన నటనకు ప్రత్యేకప్రశంసలు లభిస్తున్నాయని, చిరంజీవి నుంచి ఆ ప్రశంసలు రావడం తనకెంతో సంతోషమనిపించిందని తెలిపింది. ప్రస్తుతం అందరు తనని  'లక్ష్మీ నరసింహా రెడ్డి' అని పిలుస్తారని అది చాలని పేర్కొంది.  చిరంజీవి గారెంతో సింపుల్గా ఉంటారని, ఆయనొక మెగాస్టార్ అని, ఆయన గురించి తెలుసుకోవాలంటే.. ఇంకా కొన్ని సినిమాలు చేయాలనకుంటున్నానని తెలిపింది. 
పక్కనే ఉన్నచిరంజీవికి కూడా.. తన కోరికను చెప్పుకుంది.  మీరు తరువాత చేయబోయే సినిమాల్లో కూడా అవకాశమివ్వమని తమన్నా కోరింది.సూరీ నీకు మళ్లీ మళ్లీ చెబుతున్నా.. నువ్వు ఒక్క షాట్ కోసం పిలిచినా నేను వస్తా అంటూ తమన్నా పేర్కొంది. 


జగపతి బాబు గారికి చెప్పినట్లు తనకు చెప్పొద్దని.. ఎంత చిన్నపాత్ర అయినా చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. నీ గురించి ఏం చెప్పాలిరా?  నువు నటించడంలో గొప్పా? ప్రొడ్యూసర్ గా బెస్టా? అనేది చెప్పలేకపోతున్నా అంటూ చరణ్ ని ఆకాశానికి ఎత్తేసింది.చరణ్ నాకు ఎప్పటి నుంచో తెలిసినందుకు నాకు ఆనందంగా ఉంది. లక్ష్మీపాత్రకు తనను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ తెలిపింది.


ఈ సినిమా అంత అందంగా కనిపించడానికి కారణం.. క్యాస్టూమ్ డిజైనర్ సుష్మితా. తనతో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కోరకుకుంటున్నాను. ప్రతీ రోజూ తనతో కలసి పని చేయడం.. క్యాస్టూమ్స్ గురించి డిస్కషన్ చేయడం.. అదంతా ఒక అద్భుతమైన ప్రయాణమని చెప్పింది తమ్మూ. భవిష్యత్తులో కూడా నీతో పనిచేయాలని కోరుకుంటున్నాను. తనను అంత అందంగా చూపినంచినందుకు కెమెరెమెన్ రత్నవేలుకు ధన్యవాదాలు తెలిపింది. 
ఈ సినిమాకు సంగీతం అందించిన అమిత్ త్రివేదికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
 సైరా పాట ఇంకా తన చెవులకు వినిపిస్తూనే ఉందని, ఈ మూవీకి అతని సంగీతం పెద్ద బలమని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: