మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం  'సైరా నరసింహా రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన 'సైరా నరసింహా రెడ్డి' తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది.   ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.  ఈ మేరకు చిత్రయూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ వేదికపై నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.

 ఎక్కడి నుంచో మొదలు పెట్టాలో తెలియడం లేదంటూ తన ప్రసంగం ప్రారంభించిన రామ్ చరణ్.. మాకు గురువులుగా ఉన్న మీ ఇద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ...   పరుచూరి ఆలోచనలకు శిరస్సు వంచి నమస్కరించాడు చెర్రీ.ఈ సినిమాతో పాటు తాను కూడా సినిమా షూటింగ్ చేస్తున్నాను కాబట్టి.. ఈ సినిమాలో నా బ్యాక్ బోన్‌గా నిలిచారు హానీ అక్క, విద్య అక్క అని చెప్పారు రామ్ చరణ్. నాన్న గారికి సంబంధించిన అన్ని పనుల్లో భాగమవుతూ షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం కేటాయించి సైరా పిల్లర్స్‌గా ఉన్నారు ఆ ఇద్దరూ అని అన్నాడు.


ఈ సందర్బంగా ఎంతో మంది జగపతి బాబు గారి గురించి తనతో చెప్పారని, వాళ్ళు ఎంత చెప్పినా అంతకంటే ఎక్కువగా 10 రేట్లు మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ జగపతి బాబు గారు అని చెబుతూ ఆయనకు స్పెషల్ థాంక్స్ చెప్పారు రామ్ చరణ్.  తన ఫేవరేట్ యాక్టర్ తమన్నా అని చెబుతూ.. ఆమెకు స్పెషల్ థాంక్స్ చెప్పారు రామ్ చరణ్.  అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి మనస్ఫూరిగా ధన్యవాదాలు అని చెప్పారు.


 ఈ సక్సెస్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదని అన్నారు రామ్ చరణ్.గత నెల క్రిందట తాను రాత్రి పూట ఉలిక్కిపడి లేచే వాడినని, ఎందుకు అలా లేచే వాడినో నాకే తెలియలేదని అన్నారు చెర్రీ. 
బహుశా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలందరికీ ఇలాంటి పరిస్థితే ఉంటుందేమో అనేయడంతో అక్కడే ఉన్న దిల్ రాజు పెద్దగా నవ్వేశారు. రాజమౌళి చెప్పినట్లు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఆశీస్సులు మాపై ఉన్నాయని అన్నారు రామ్ చరణ్. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: