దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడిగా చిరంజీవి  వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. కానీ మన దిల్ రాజు గారు మాత్రం సినిమా చూస్తూ ఏడ్చేశారట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఈ సినిమా  ఘన విజయం సందర్బంగా సైరా యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించారు.


సినిమాకి పనిచేసిన ఎందరో వేదికపై మాట్లాడుతూ ఈ సినిమాలో తమ అనుభవాలను పంచుకున్నారు.వీరితో పాటు  ఈ వేదికపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. చిరంజీవి 12 ఏళ్ల కల పరుచూరి వారి 15 సంవత్సరాల కల ఈ రోజు నెరవేరిందని అన్నారు. మొదటి రోజే ఈ సినిమా 85 కోట్ల గ్రాస్ రాబట్టిందని, ఇది సూపర్ ఫిగర్ అని చెప్పారు. చిరంజీవి సినిమాల్లో 151 వ సినిమా అయిన సైరా ఆయన కెరీర్‌లో బెస్ట్ సినిమా అని, ఇదో రెస్పెక్టెడ్ సినిమా అని అన్నారు దిల్ రాజు.

అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నయనతార, తమన్నా, సుదీప్.. ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నానని అన్నారు. కానీ  సైరా సినిమా చూస్తుంటే తనకు మూడు సార్లు ఏడుపొచ్చిందని చెప్పారు దిల్ రాజు. సురేందర్ రెడ్డి ఎమోషన్స్ బాగా పండించారని పేర్కొంటూ హాట్సాఫ్ సూరి అన్నారు. చిరంజీవిగారి డ్రీమ్‌ని నిజం చేసిన రామ్ చరణ్‌ని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నాని అన్నారు దిల్ రాజు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.


'సైరా నరసింహా రెడ్డిప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన 'సైరా నరసింహా రెడ్డి' తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది.ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: