సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ డైరెక్టర్  అనిల్ రావిపూడి దర్శకత్వంలో "సరిలేరు నీకెవ్వరు" సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు.  మహేష్ బాబు చివరగా నటించిన "మహర్షి" సినిమా మంచి విజయం సాధించింది. అనిల్ రావిపూడి  దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు మంచి విజయాలు  సాధించాయి. రీసెంట్ గా ఆయన దర్శకత్వం వహించిన ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయ్యింది.

సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడి  సినిమాకు సంబంధించిన సమాచారాన్ని ట్వీట్టర్ లో అప్డేట్ చేస్తూ సినిమా పైన అంచనాలను పెంచుతున్నాడు . ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేసిన ఇంట్రో మరియు టైటిల్ సాంగ్ లకి మంచి స్పందన వచ్చింది. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీ లో కొండారెడ్డి బురుజు  సెట్ వేశారు. ఇక్కడ కొన్ని ఫైట్స్ మరియు కీలక సన్నివేశాలను షూట్ చేశారు .తాజా సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు సినిమా 75 శాతం పూర్తి అయ్యిందంట. ప్రస్తుతం సినిమా యూనిట్ బ్రేక్ లో ఉన్నారు. కొత్త షెడ్యూల్ త్వరలో మొదలవుతుంది.


ఈ సినిమా టీజర్ ని దీపావళి  కానుకగా విడుదల చేసే అవకాశం ఉందట. ఈ సినిమా తో లేడి సూపర్ స్టార్ విజయ శాంతి మళ్ళీ సినిమాల్లోకి  రీ ఎంట్రీ  ఇస్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు మరియు విజయ శాంతి కలిసి నటించనున్నారు   రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది . హాస్య నటుడు బండ్ల గణేష్  పాత్ర అందరిని ఆకట్టుకుంటుందట. దిల్ రాజ్, అనిల్ సుంకర, మహేష్ బాబు  సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: