ఈరోజు విడుదలైన ‘చాణక్య’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అనీల్ సుంకర ‘సరులేరు నీకెవ్వరు’ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం తెలియచేసాడు. ఈ మూవీని మహేష్ తో నిర్మిస్తున్న అనీల్ సుంకర మహేష్ బాబు వీరాభిమాని మాత్రమే కాకుండా గతంలో మహేష్ తో ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసి ప్రముఖ నిర్మాతగా మారిన ట్రాక్ రికార్డ్ ఈయనకు ఉంది.

గతంలో మహేష్ తో హిట్ సినిమాలతో పాటు ఫెయిల్యూర్ సినిమాలను కూడ తీసిన ఈయన ఇప్పటికీ మహేష్ తో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తిరిగి మహేష్ తోనే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని తీస్తున్నాడు. అమెరికాలో అనేక వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న అనీల్ సుంకరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడ ఉంది.

తనకు ఎన్ని కష్టాలు వచ్చినా మహేష్ బాబు చిరునవ్వు చూస్తే తన టెన్షన్ లు అన్నీ తగ్గిపోతాయి అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మహేష్ 50 కోట్ల పారితోషికం ఇస్తున్న వార్తల పై స్పందించాడు. ఈ సినిమా షూటింగ్ సుమారు 70 శాతం వరకు పూర్తి అయినా ఇప్పటి వరకు మహేష్ కు ఒక్క రూపాయి కూడ పారితోషికంగా ఇవ్వలేదనీ మహేష్ పారితోషికం పై వస్తున్న వార్తలు అన్నీ అబద్ధాలు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఈ మూవీకి మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈ మూవీ బిజినెస్ లో మాత్రమే మహేష్ కు వాటా ఉంది కానీ పారితోషికంగా ఒక్క రూపాయి కూడ పుచ్చుకోను అంటూ మహేష్ ఈ మూవీ ప్రారంభం సమయంలో తనకు చెప్పిన విషయాన్ని బయట పెట్టాడు. అంతేకాదు మహేష్ పారితోషికం గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపధ్యంలో తాను ఈ క్లారిటీ ఇస్తున్నాను అంటూ అనీల్ సుంకర ‘చాణక్య’ సినిమా ప్రమోషన్ లో స్వయంగా వెళ్ళడించడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: