టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు. సేనియర్ నటి విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు భరత్ అనే నేను, మహర్షి వంటి వరుస సూపర్ హిట్స్ తో మహేష్ దూసుకుపోతుండగా, మరోవైపు ఇప్పటివరకు కెరీర్ పరంగా ఒక్క అపజయం కూడా చూడని అనిల్ రావిపూడి, 

ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు ఫుల్ రేంజ్ ఎంటర్టైన్మెంట్స్ తో ఒక పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతానికి పైగా పూర్తి అయిందని, నిన్న ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఏకే ఎంటెర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ చెప్పారు. అంతేకాక, కొద్దిరోజుల నుండి ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపుగా రూ.50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అటువంటిది ఏమి లేదని, అవన్నీ ఒట్టి పుకార్లని అనిల్ తేల్చి చెప్పడం జరిగింది. 

అయితే ఈ సినిమాకు మహేష్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం అందరికి పెద్ద షాక్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఒక భాగస్వామి అని, ఇప్పటివరకు ఆయనకు తన నుండి కాని, దిల్ రాజు గారి నుండి కానీ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ రూపంలో ఇవ్వలేదని, ఈ విషయాన్ని సదరు ఛానల్ కెమెరా ముఖంగా ప్రేక్షకులకు మరియు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు తెలియచేస్తున్నట్లు చెప్పారు అనిల్ సుంకర. ఇక సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తమకందరికీ ఉందని, ఒకవేళ ఆ విధంగా మంచి హిట్ అయి లాభాలు అర్జిస్తే అందరికీ మంచిదే కదా అంటూ మాట్లాడారు అనిల్....!!


మరింత సమాచారం తెలుసుకోండి: