ఒకరు అక్కినేని నాగార్జున పరిచయం చేసిన సూపర్ హీరోయిన్. ఇంకొకరు సూపర్ స్టార్ రజనీకాంత్ తోనే డెబ్యూ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్. ప్రస్తుతం ఆ ఇద్దరూ సౌత్ లో స్టార్ హీరోయిన్స్. ఇక ఈ ఇద్దరు ఒకరితో ఒకరు పోటీపడుతూ దశాబ్ధంపైగానే కెరీర్ ని లీడ్ చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరికీ ఒక విషయంలో చాలా తేడా ఉంది. ఒకరు సంపాదనలో, బిజినెస్ విషయంలో ఏమాత్రం తగ్గరు. ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. మరొకరు మాత్రం స్నేహం కోసం, ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ కోసం ఎదుటివారికి విలువనిచ్చి రెమ్యునిరేషన్ గురించి పట్టించుకోకుండా నటించడానికి ముందుకొస్తారు. ఆ ఇద్దరే నయనతార...స్వీటీ అనుష్క శెట్టి. 

ఇటీవలే రిలీజైన సైరా- నరసింహారెడ్డిలో నయనతార- అనుష్క ల నటనకు పేరొచ్చింది. ఈ సినిమాలో నటించినందుకు నయనతార ఏకంగా 6కోట్ల పారితోషికం అందుకున్నారని ప్రచారమైంది. నయన్ కి మరీ అంత ఇచ్చారా?  కొణిదెల ప్రొడక్షన్స్ అంత రెమ్యునిరేషన్ ఇవ్వడానికి డేర్ చేసిందా! అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. నయనతారలో ఉన్న కమర్షియల్ పంథా మీద కూడా చర్చ సాగింది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. సైరా నరసింహారెడ్డి సినిమాలో ఉయ్యాలవాడను పరిచయం చేసే ఝాన్సీలక్ష్మీ భాయ్ పాత్రలో స్వీటీ అనుష్క నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ విషయాన్ని సైరా టీమ్ చివరి వరకూ సీక్రెట్ గా ఉంచింది. అనుష్క సైరాలో ఉందన్న వార్త బాగా వైరల్ అయినప్పటికి సినిమాలో చూసి సర్ ప్రైజ్ అవ్వాలనే యూనిట్ రివీల్ చేయలేదు. అంతేకాదు.. స్వీటీ ఆ పాత్రలో నటించినందుకు ఎలాంటి పారితోషికం లేకుండానే కేవలం చిరుపై గౌరవంతో నటించిందని తెలుస్తోంది. అంతేకాదు..పైసా పారితోషికం కూడా డిమాండ్ చేయలేదట. స్వీటీ నిజంగా స్వీట్ అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ కావాలా? అందుకే పరిశ్రమలో దశాబ్ధంన్నర పాటు ఎదురే లేకుండా కెరీర్ ని సాగిస్తోంది. అందుకే ఆమె కమర్షియల్.. ఈమె స్వీట్ అందరు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఎలాంటి రెమ్యునిరేషన్ లేకుండా చిరుతో ఉన్న స్నేహం వలనే నటించారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. 



మరింత సమాచారం తెలుసుకోండి: