మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా భారీ స్థాయిలో, అత్యధిక బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిన విలువలతో తెరకెక్కిన తాజా సినిమా, సైరా నరసింహారెడ్డి మూడు రోజుల క్రితం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. ఇక షూటింగ్ ప్రారంభం నుండి ఇటీవల టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ దాకా కొద్ది కొద్దిగా అంచనాలు పెంచుకుంటూ వచ్చిన సైరా సినిమా, ఒక్కసారిగా రిలీజ్ రోజున ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా పై పెదవి విరుస్తున్నారు. 

అయితే మెగాస్టార్ చిరంజీవి అత్యద్భుతంగా పెర్ఫర్మ్ చేసిన ఈ సినిమాలో వండర్ఫుల్ విజువల్స్, అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారీస్థాయిలో వేసిన సెట్టింగులు, మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రమే సినిమాలో బాగున్నాయని, అలానే సినిమాలో చాలా చోట్ల ల్యాగ్ ఉంటుందని, ఇక ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోదని అంటున్నారు. ఇకపోతే సెకండ్ హాఫ్ ఎమోషనల్ సన్నివేశాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయని, సినిమాలో ఎంటర్టైన్మెంట్ లోపించిందని అంటున్నారు. ఇక సినిమా ప్రథమార్థం ఇంటర్వెల్ లో వచ్చే అండర్వాటర్ ఫైట్, సెకండాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మరియు ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ వంటివి బాగానే ఉన్నప్పటికీ, మొత్తంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఈ సినిమాను తీయడంలో మాత్రం విఫలమయ్యాడనే అంటున్నారు. 

తొలి రోజుల తర్వాత చాలామేరకు డ్రాప్ అయిన ఈ సినిమా కలెక్షన్లతో నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత అంతర్మథనంలో పడ్డట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి తామందరమూ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, అయితే సినిమా కేవలం యావరేజ్ గా మాత్రమే టాక్ ను సంపాదించుకుని ముందుకు సాగుతూ ఉండటంపై సైరా టీమ్ మొత్తం ఆలోచనలో పడ్డాడట. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాణక్య సినిమా మంచి హిట్ టాక్ ని అందుకోవడంతో, దానితో సైరా కలెక్షన్స్ కి గండి ఏర్పడుతుందని కూడా భావిస్తున్నారట. మరి రాబోయే రోజుల్లో నరసింహారెడ్డి సినిమా ఎంతమేర కలెక్షన్స్ సాదించి ముందుకు సాగుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: