మహేష్
దసరా సెలవుల సందర్భంగా పిల్లలు గౌతమ్, సితార, భార్య నమ్రతతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. స్విట్జర్లాండ్కు వెళ్లిన తర్వాత అక్కడి స్విస్ ఆల్ప్స్ దగ్గర తీసుకున్న ఫొటోను శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశారు. భూమిపై నాకు ఇష్టమైన ప్రాంతం స్విస్ ఆల్ప్స్.
దసరా సందర్భంగా వచ్చిన షార్ట్ బ్రేక్ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తా’అంటూ
మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవలె విడుదలైన
ప్రిన్స్ మహేష్బాబు కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తన 25వ చిత్రం ‘మహర్షి’.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు,
అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్కు జోడీగా
పూజా హెగ్డే నటించింది. దేవీ
శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే 25వ మూవీ కావడంతో
మహేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలో మహేశ్బాబు మూడు విభిన్న పాత్రలో కనిపించారు. స్టూడెంట్, సీఈవో, రైతు పాత్రల్లో
మహేష్ సందడి చేసి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన గత చిత్రాలకు భిన్నంగా మహేశ్ పాత్ర ఈ చిత్రంలో ఉంది .
ఇకపోతే హీరోలు వాళ్ళకున్న బిజీలో ఫ్యామిలీతో స్పెండ్ చెయ్యడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మహేష్బాబు ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో మంచిగా గడుపుతుంటారు. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇటు ఫ్యామిలీ అటు సినిమాలు చాలాచక్కగా బ్యాలన్స్డ్గా చేస్తుంటారు.
ప్రస్తుతం
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు.
అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రకాశ్రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని అభిమానుల ముందుకు తీసుకురానున్నారు.