"శశి వదనే - శశి వదనే.. స్వర నీలాంబరీ నీవా... అందేలా వన్నెల వైఖరితొ నీ మది తెలుపగ రావా..." అంటు గుర్రం మీద రాకుమారుడిలా వచ్చి తెలుగు ప్రేక్షకుల మదిలొ ఇప్పటికీ నిలిచిన మలయాళ నటుడు మోహనలాల్.
ఈ మధ్య యాత్ర సినిమా తో వైయస్ గారిని మరిపించి తెలుగు తెర కు మరింత చేరువైన నటుడు మమ్ముట్టి.
ఈ ఇద్దరు మలయాళ నటులు తెలుగు తెర కు ఎంతగానో సుపరిచితం.

తాజాగా మమ్ముట్టి ఒక ఇంగ్లీషు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మోహన్ లాల్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. 
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి టాలీవుడ్‌లో అనేక మలయాళ డబ్బింగ్ సినిమాలతో బాటు డైరెక్ట్‌గా ‘స్వాతి కిరణం’‘సూర్యపుత్రులు’, ‘రైల్వే కూలీ’, రీసెంట్‌గా ‘యాత్ర’ వంటి చిత్రాలతో మన తెలుగు ఆడియన్స్‌నూ పలకరించాడు. మరోవైపు మమ్ముట్టి తోటి నటుడు మోహన్ లాల్ కూడా మల్లువుడ్‌లో అగ్ర కథానాయికునిగా స్వ గుర్తింపు తెచ్చుకున్నారు. మోహన్ లాల్ కూడా తెలుగులో ‘గాండీవం’తో పాటు ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు  దగ్గరయ్యారు. తాజాగా మమ్ముట్టి హీరోగా  ‘మామంగం’ అనే మలయాళ జానపద సినిమా చేసారు. ఈ సినిమా మలయాళంతో పాటుగా తమిళ్,తెలుగు, కన్నడ,హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ‘మమంగం’ సినిమాను కేరళలో అతి ప్రాచీనమైన కలరి విద్యలో విశిష్టతను చెప్పేలా ఈ నవంబర్ 21న విడుదల చేయనున్నారు. ఈ సినిమా కథ జమోరిన్ పాలనలోని చావెరుక్కళ్ యుద్ధ వీరుల చారిత్రాధారమైనది.
మోహన్ లాల్ నేను హీరోలుగా స్టార్ డమ్ అందుకోకముందు నుంచే మా మధ్య మంచి స్నేహం ఉండేదని మామ్ముట్టి ఒక ఇంటర్వూ లో చెప్పుకొచ్చారు. మేమిద్దరం పాత్రల, నటన విషయంలో మాత్రమే పోటీ పడుతుంటాం తప్ప మా ఇద్దరి వ్యక్తిగతంగా ఎలాంటి పోటీ లేదని చెప్పారు. ఇక మమ్ముట్టి హీరోగా నటించిన ‘మమాంగం’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: