మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా సైరా. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కలిగిన సైరా ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయడం జరిగింది. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెలుగు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొట్టమొదటిసారిగా దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఆయన కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సైరా లో టైటిల్ రోల్ చిరంజీవి చేశారు. దాదాపు చాలా కాలం తర్వాత షూటింగ్ ముగించుకొని ఇటీవల దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ‘సైరా’ అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుంది. ఒక బాలీవుడ్ మినహా  అన్ని చోట్ల రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. దసరా సెలవుల నేపథ్యంలో సైరా సినిమా హాల్ లు కిటకిటలాడుతున్నాయి.


హౌస్ ఫుల్ కలెక్షన్లతో..టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసే పనిలో ‘సైరా’ నిమగ్నమైంది. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఇటువంటి నేపథ్యంలో తర్వాత సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.


అయితే సురేందర్ రెడ్డి తర్వాత చేయబోయే సినిమా మహేష్ బాబు తో గాని జూనియర్ ఎన్టీఆర్ తో గాని ఉంటుందన్న వార్త చాలా బలంగా వినపడుతోంది.  ప్రస్తుతం మాత్రం సురేందర్ రెడ్డి 'సైరా' సినిమా..సక్సెస్ సంబరాలలో మునిగి తేలుతున్నారు. చిరంజీవి కెరీర్లోనే ఈ సినిమా 'ఇంద్ర' తరహాలో లాంటి విజయం సాధించిందని సైరా పై చాలా మంది మెగా అభిమానులు ఇండస్ట్రీలో ఉన్నవారు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి చిరంజీవి వెళ్ళిన తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ పై మెగా హీరోల ప్రభావం తగ్గిందని చాలామంది కామెంట్ చేస్తున్న తరుణంలో చిరంజీవి ఇటువంటి విజయాన్ని సాధించడంతో మంచి జోష్ మీద ఉన్నారు మెగా అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: