ప్రముఖ టాలీవుడ్ నటుడు  దగ్గుబాటి రానా గత కొంత కాలంగా అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఆరోగ్య సమస్యల వల్ల అక్కడ ఉంటున్నారని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఆయన  ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటో లో ఆయన చాలా సన్నగా అయ్యారు. రానా  ఆదివారం  ఇండియాకి వచ్చినట్టు ట్వీట్టర్ వేదిక గా తెలిపారు.


నటుడు రానా ప్రస్తుతం  " హౌస్ ఫుల్ 4 " అనే హిందీ సినిమాలో  విలన్ గా నటిస్తున్నారు.  రీసెంట్ గా విడుదలైన " హౌస్ ఫుల్ 4 " ట్రైలర్ కు  మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ లో రానా ఒక తోడేలు తో ఫైట్ చేస్తూ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా లో  బాలీవుడ్ కిలాడి  అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ , పూజా హెగ్డే, కృతి సనన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమా కి ఫర్హాద్  దర్శకత్వం వహిస్తున్నారు.


 ఓ ఆంగ్ల పత్రిక రానా పై రాసిన వార్త  ఆయనకు ఆగ్రహాన్ని తెచ్చింది .  విషయానికొస్తే " హౌస్ ఫుల్ 4 " సినిమా షూటింగ్ లండన్ లో జరిగింది. లండన్ షెడ్యూల్ కి రానా తన చెఫ్ ను తీసుకు వెళ్లడని. రానా ఏలాంటి భోజనం ఇష్టపడతాడో , ఏలాంటి డైట్ ఫాలో అవుతాడో  చెఫ్ కు బాగా తెలుసని. లండన్ లో  రానా  బస చేసిన హోటల్లో  రానా కోసం ప్రత్యేకంగా వంటకాలు  తయారు చేసేవాడని రాసింది.ఈ విషయాన్ని ట్వీట్ కూడా చేసింది.


ఈ విషయం పై రానా స్పందించారు." నేను లండన్ లో జరిగిన షూటింగ్ లో పాల్గొనలేదు. మీరు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు" అని రానా  కొప్పడ్డారు. దీంతో సదరు ఆంగ్ల పత్రిక  ట్వీట్ ను డిలీట్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: