మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి, ప్రముఖ కమెడియన్ బండ్ల గణేష్, మరొక నటి సంగీత చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో తాజా షెడ్యూల్ ని జరుపుకోగా, మలి షెడ్యూల్ ఈ నెల రెండవ వారంలో మొదలుకానుంది. ఇకపోతే దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమా నుండి ఒక ప్రత్యేక పోస్టర్ ని రేపు సాయంత్రం గం.5.04ని.లకు రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక ప్రకటన చేయడం జరిగింది. సూపర్ స్టార్ ని మీరు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాంటి పోస్టర్ మీ కోసం రిలీజ్ చేయబోతున్నాం, రేపు సాయంత్రం సిద్ధంగా ఉండండి అంటూ అనిల్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. 

ఇక ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాద్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ పోస్టర్ చూద్దామా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన ఈ సినిమాను రాబోయే దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: