టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ ఈ సంవత్సరం విడుదలైన రెండు బడా సినిమాలలో నటించి ఆ సినిమాల విజయంలో తన పాత్రను కూడా ప్రూవ్ చేసుకుంది. కానీ ఆ తరువాత నుంచే కాజల్ ప్రవర్తనలో వింత మార్పులు చోటుచేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్-2’ నటించే అవకాసం వచ్చినా ఆ గోల్డెన్ ఆఫర్ ను కాలతన్నుకుంది. ఆ తరువాత తన దృష్టి అంతా తమిళ సినిమాల పైనే అంటు కోలీవుడ్ ను చిరునామాగా చేసుకున్న కాజల్ ధనుష్, ఉదయనిధి స్టాలిన్, కమలహాసన్ సినిమాలలో ప్రస్తుతం నటించడానికి ఎగ్రిమేంట్ల పై సంతకాలు పెట్టింది కాజల్.  మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం కాజల్ నటిస్తున్న తమిళ సినిమా నిర్మాతలు ఎవరు కాజల్ కోరుకునే భారీ పారితోషికాలను ఇవ్వడంలేదు. అంతేకాదు మన బడా తెలుగు నిర్మాతలు ఆఫర్ చేస్తున్న పారితోషికంలో కనీసం సగం కూడ కాజల్ కు కోలీవుడ్ నిర్మాతలు ఇవ్వడం లేదట. అయినా అందరికీ ఆశ్చర్య కలిగిస్తూ తమిళ సినిమాల వైపే చూస్తోంది కాజల్. ఇటువంటి పరిస్థుతులలో కాజల్ కు సంబంధించి బయటకు వచ్చిన మరో లేటెస్ట్ న్యూస్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ వెంకటేష్ లు నటించబోతున్న భారీ సినిమాకు కృష్ణవంశీ చరణ్ పక్కన నటించడానికి కాజల్ ను సంప్రదిస్తే ఆమె ఈసినిమా కధను కూడ అసలు వినకుండా తనకు ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని చెప్పిందట. ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ కాజల్ కు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినా కాజల్ లెక్క చేయలేదట. దీనికి కొనసాగింపుగా కాజల్ ను ఒప్పించడానికి రామ్ చరణ్ వ్యక్తిగతంగా చేసిన ప్రయత్నాలు కుడా విఫలం కావడం టాలీవుడ్ లో చర్చనీయాంసంగా మారి కాజల్ పై మరో సరికొత్త సంచన వార్త బయటకు వచ్చింది.  తెలుస్తున్న సమాచారం మేరకు టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలలో ఒకరు కాజల్ మనసును తీవ్రంగా గాయపరిచారని అప్పటి నుంచే కాజల్ టాలీవుడ్ హీరోల పై విరక్తి పెంచుకుందని దీనికి తోడు కాజల్ తల్లితండ్రులు కూడ కాజల్ ను టాలీవుడ్ సినిమాలలో నటించవద్దని ఒత్తిడి చేస్తున్నారని టాక్. ఎదిఎమైనా మెగా కుటుంబ హీరోలతో వరసగా వస్తున్న అవకాశాలను వదులు కుంటున్న హీరోయిన్ గా కాజల్ రికార్డు క్రియేట్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: