సైరా’ ప్రచారానికి
నయనతార రాకపోవడం పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీనితో
చిరంజీవి లాంటి మెగా హీరోను కూడ
నయనతార పట్టించుకోదా అంటూ మెగా అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ అనేక కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ అన్ని
నయనతార దృష్టి వరకు వచ్చినట్లు ఉన్నాయి. దీనితో తన పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి నయన
తార ఊహించని విధంగా బ్రేక్ వేసింది.
భవిష్యత్ లో తనను ఎవరూ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు పిలవకుండా ఉండేందుకు
నయనతార ఒక బ్రహ్మాస్త్రాన్ని వదిలింది. తాను తను నటించే సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాలు పంచుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని
నయనతార లీక్ ఇచ్చింది. అంతేకాదు గతంలో తాను ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వెళ్ళానని ఆ సినిమా డిజాస్టర్ అయ్యిందని ఆతర్వాత తను తన సిమేమాల ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాలుపంచుకోవడం మానివేశానని క్లారిటీ ఇచ్చింది.
దీనితో ఈమెతో సినిమాలు చేసే వారెవరూ ఈమెను ప్రమోషన్ కు రమ్మని పిలవరు అన్న క్లారిటీ వచ్చేసింది. అయితే
నయనతార ‘సైరా’ ప్రమోషన్ కు రాకపోయినా ఆ మూవీ ఎందుకు కలెక్షన్స్ విషయంలో ఇబ్బంది పడుతోంది అన్నది సమాధానం లేనిప్రశ్న. ‘సైరా’ లో నటించి నందుకు నాయన తారకు 4 కోట్ల పారితోషకం ఇచ్చిన విషయం తెలిసిందే.
సాధారణం తన వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడని
నయనతార ఈమధ్య ‘వోగ్’ ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఫోటో షూట్ ఇస్తూ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు లీక్ చేసింది. దీనితో భవిష్యత్ లో నయనతారను తమ ఫంక్షన్స్ కు రమ్మని ఏ హీరో పిలవడు. ఇది ఇలా ఉండగా నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మాతగా వ్యవహరిస్తూ తీస్తున్న ‘నెట్రికన్’ మూవీ ప్రారంభోత్సవానికి కూడా నయన్ డుమ్మా కొట్టడం బట్టి
నయనతార సెంటిమెంట్ అందరికీ అర్ధం అవుతుంది..