ప్రస్తుతం మహాత్మా గాంధీ 150వ జన్మ దినోత్సవ వేడుకలు దేశంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది అంతా మహాత్మా గాంధీకి సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించి మహాత్ముడి స్పూర్తి నేటితరం వారికి కలిగించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అయన స్ప్రుతికి గుర్తింపుగా చిరంజీవి తన ‘సైరా’ ను వేడుదల చేసాడు. 

ఇలాంటి పరిస్థితులలో మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడ మహాత్ముడి వైపు అడుగులు వేయడం హాట్ న్యూస్ గా మారింది. దర్శకుడు  మేర్లపాక గాంధీ రెండు మంచి సినిమాలు తీసి ఆతరువాత తీసిన ‘కృష్ణార్జున యుద్ధం’ తో బ్రేక్ పడిపోయి ఫ్లాప్ దైరెక్టర్స్ లిస్టులోకి చేరి పోయాడు. ఇలాంటి పరిస్థుతలలో ఈ డైరెక్టర్ దృష్టి సాయి తేజ్ పై పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

‘సాహో’ షాక్ నండి తేరుకున్న యువి క్రియేషన్స్ ఒక మీడియం రేంజ్ సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వస్తవానికి నాగచైతన్య యువి క్రియేషన్స్ ఒక మూవీ ప్రాజెక్ట్ అనుకున్నారు. అయితే ప్రస్తుతం  చైతన్య బిజీ అయిపోవడంతో ఈ నిర్మాణ సంస్థ ఆలోచనలు మారిపోయి వారు సాయి ధరమ్ తేజ్ వైపు టర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ ప్రయత్నాలలో  భాగంగా మేర్లపాక గాంధీతో మెగా క్యాంప్ హీరో సాయి ధరమ్ తేజ్ కు ఒక కథ చెప్పించినట్లు తెలుస్తోంది. ఆ కథ విని హీరో సాయి ధరమ్ తేజ్  ఈ మూవీని గురించి  ఆలోచిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మేర్లపాక గాంధీ క్రియేట్ చేసిన ఈ కథ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కధలో హీరో తన ఊరందరిచేత మందు మానిపించడం లాంటి కాన్సెప్ట్ తో ఈ కథ తయారు అయిందని టాక్. అయితే మాస్ ఇమేజ్ ఉన్న సాయి తేజ్ ఇలాంటి పాత్రను పోషిస్తే అది సాహసమే అవుతుంది అని అంటున్నారు. ఈ మూవీ కధను తన మామయ్య చిరంజీవికి కూడ చెప్పి ఆపై ఈ మూవీ ప్రాజెక్ట్ పై ఒక నిర్ణయం తీసుకోవాలని సాయి తేజ్ భావిస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: