‘చిత్రలహరి’తో ఫామ్లోకి వచ్చిన సుప్రీం హీరో
సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలను అంగీకరిస్తు్న్నారు. ఇప్పటికే
మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే, సుబ్బు అనే కొత్త దర్శకుడితో పనిచేయడానికి సాయి ధరమ్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బీవీఎస్ఎన్
ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభంకావాల్సి ఉంది.
సాయితేజ్, నభా నటేశ్ జంటగా నటిస్తోన్న చిత్రానికి `సోలో బ్రతుకే సో బెటర్` అనే టైటిల్ను ఖరారు చేశారు. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్పై బీవీఎస్ఎన్
ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజయదశమి సందర్భంగా సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. టైటిల్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
దీన్ని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాలో
సాయి ధరమ్ తేజ్ కొత్త అవతారంలో కనిపించనున్నారట. ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలు తేజూ చేతిలో ఉన్నాయి. దర్శకులు దేవాకట్ట, మేర్లపాక గాంధీలతో సాయి ధరమ్ జతకట్టనున్నారు. వీటిని సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.
సాయితేజ్, నభా నటేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: సుబ్బు, నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్.