గతంలో వరుస ఫ్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ‘ఖుషి’ తర్వాత ఆ తరహాలో ‘జల్సా’ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టాడు పవన్. ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేసిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి...దీంతో ఈ సినిమాతో గ్యారెంటీగా త్రివిక్రం -అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు మెగా అభిమానులు.


ఇదిలా ఉండగా తాజాగా దసరా సందర్భంగా “అల వైకుంఠపురములో” సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేయడం జరిగింది. పోస్టర్ లో అల్లు అర్జున్ ఒక చూన్ని పట్టుకొని ఫుట్బాల్ కోర్టులో ఫైట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో ఈ పిక్ చూసిన చాలా మంది మెగా అభిమానులు...త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఫైట్ సీన్ ని జల్సా తరహాలో చూపిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ‘జల్సా’ సినిమా క్లైమాక్స్ లో చాలామంది బాడీ బిల్డర్లు గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ తో ఫైట్ చేయడం జరుగుతుంది...అదే ఫైట్ సీన్ లో తనికెళ్ల భరణి గ్రౌండ్ లోనే చనిపోతారు. ఆ సీన్ ఇప్పటికీ మెగా అభిమానులకు గుర్తుండే ఉంటుంది.


ఇప్పుడు అదే తరహాలో..అల్లు అర్జున్ ని కూడా గ్రౌండ్ లో...ఓ అమ్మాయి కోసం ఫైట్ త్రివిక్రమ్ చేయిస్తున్నాడని...పిక్ బట్టి అర్థమవుతుంది అంటూ దసరా సందర్భంగా “అల వైకుంఠపురములో” సినిమాలో ఉన్న పిక్ చూసి సోషల్ మీడియాలో మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరోపక్క సినిమా యూనిట్ సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి “అల వైకుంఠపురములో” సినిమాతో త్రివిక్రమ్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ సాధిస్తారో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: