ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా వస్తున్న దబాంగ్3 టీజర్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పై తన సోదరుడు
అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రభుదేవా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో
సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించగా.....కన్నడ హీరో కిచ్చ సుధీప్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. చుల్ బుల్ పాండేగా సల్మాన్.. మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నాడని టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది.
సినిమా నాది.. పోస్టర్ నాది.. ప్రమోషన్ కూడా నేనే చేయాలి కదా అంటూ ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేశాడు సల్లు భాయ్. అది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తోన్న కిచ్చా
సుదీప్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. దీనితోపాటు సల్మాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. విలన్ ఎంత పెద్దగా ఉంటే.. పోరాడటంలో అంత మజా ఉంటుందని ట్వీటాడు సల్లు భాయ్.దీన్ని బట్టి చూస్తే..
సుదీప్ ఎంత భయంకరంగా ఉండబోతున్నాడో అర్థమవుతోంది.
ఈ మూవీలోసుధీప్ బల్లి అనే పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అటు బాలీవుడ్ కండల వీరుడు, ఇటు కన్నడ నటుడు.... వీరిద్దరి మధ్య పోరాటం ఎలా ఉంటుందో చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. అయితే సల్మాన్ లుక్స్, టీజర్, ట్వీట్స్ తో సినిమాపై అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆలా
సల్మాన్ ఖాన్ వెండి తెరపై కనిపిస్తే చాలు.. బాక్స్ ఆఫీస్ కు కోట్లు పడాల్సిందే.అందుకు నిదర్శనం ఈ మధ్యనే రిలీజ్ ఐన ‘భారత్' మూవీ.
స్వతంత్ర్యం రాక పూర్వం నుంచి ప్రస్తుతం వరకు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఒక కల్పిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ విభిన్న పాత్రలు పోషించాడు.ఈ మూవీ..... అంచనాలను అందుకోలేకపోయింనప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్లలను సాధించింది.
.