యంగ్ హీరో నవదీప్ హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. గత కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు .నేనే రాజు నేనే మంత్రి , ధృవ సినిమాల్లో ఆయన చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది కానీ హీరోగా సినిమా అవకాశలు మాత్రం రావడం లేదు.లాస్ట్ ఇయర్ సి-స్పేస్ అనే సంస్థను స్థాపించాడు.
నవదీప్ కు సంబంధించిన ఒక హాట్ న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఆల్ట్ బాలాజీ బ్యానర్ లో నవదీప్ కి అవకాశం వచ్చిందట. ఎరోటిక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు తీయడంలో ఈ బ్యానర్ ముందుంటుంది. రాగిణి ఎంఎంఎస్ పేరుతో వచ్చిన రెండు సినిమాలు, ఒక వెబ్ సీరీస్ మంచి విజయం సాధించాయి. యువతలో ఈ ఫ్రాంచైజ్ కు మంచి క్రేజ్ ఉంది. శృంగార తార సన్నీలియోన్ ప్రధాన పాత్రలో రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ ` వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రారంభం అయ్యింది.ఈ వెబ్ సీరీస్ లో నవదీప్ కీలక పాత్రలో కనిపించనున్నడట. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ ` హారర్ నేపథ్యంలో సాగే ఎరోటిక్ వెబ్ సీరీస్ . ఈ వెబ్ సీరీస్ లో ఘాటైన అదర చుంబనలు, బెడ్ రూమ్ సీన్లకు కొదువ ఉండదు.
మంగళ వారం ఇన్స్టాగ్రామ్ వేదికగా సన్నీలియోన్ నవదీప్ తో కలిసి ఉన్న ఫోటో ను షేర్ చేస్తూ నవదీప్ లాంటి మంచి వ్యక్తి తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది అని పోస్ట్ చేసింది. నవదీప్ ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అల వైకుంఠపురం లో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్ కు మంచి స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: