డిమాండ్ ఉన్నప్పుడే కాసులు ఎలా కూడగట్టుకోవాలో నయనతారని చూసి నేర్చుకోవాలి హీరోయిన్లంతా. ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా, కామ్ తా తన పని తాను చేసుకుపోతుంది కానీ, ఎక్కడ దేన్ని ఎలా రాబట్టుకోవాలో బాగా తెలుసు నయన్ కి. సినిమాలు దాదాపు మానేసింది అనుకున్న తరుణంలో నేను వచ్చేశా అంటూ ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఆమె అభిమానులు ఆనందంతో ఎగిరి గంతులేశారు. వాళ్లెవరినీ డిజప్పాయింట్ చేయకుండా వరుస చిత్రాలతో బాగానే అలరిస్తోంది. తెలుగులో వెంకీ సరసన కృష్ణవంశీ చిత్రంలో నటిస్తోంది. శేఖర్ డైరెక్షన్లో అనామిక చేస్తోంది. ఫుల్లు డిమాండుతో దూసుకుపోతోంది. మరి అలాంటప్పుడు తన విలువను తాను చాటి చెప్పుకోవాలి కదా! అందుకే తనను కోరి పెట్టుకుంటున్నవారి దగ్గర నిర్మొహమాటంగా డిమాండ్ చేస్తోంది నయన్. శింబుతో నటించమని దర్శకుడు అడగ్గానే... కోటిన్నర ఇస్తే చేయడానికి అభ్యంతరం లేదు అందట. తాజాగా ఆమె శింబుతో చేయడానికి సై అందన్న విషయం తెలిసిందే కదా. నయన్ పాత విషయాలను మర్చిపోయిందా అని ఆరా తీస్తే ఈ విషయం బయటపడింది. శింబుతో నయన కలిస్తే తన సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడుతుందని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారన్నది సుస్పష్టం. అయితే వారి ప్లాన్ ను నయన్ గమనించకుండా ఉంటుందా? అందుకే తన ప్లాను తను వేసింది. మీకంతగా నేనే నటించాలని అనుకుంటే, కోటిన్నర ఇవ్వండి, తప్పకుండా చేస్తాను అంటూ మెలిక పెట్టింది. చూశారా ఎంత తెలివైనదో. ఇండస్ట్రీలో రాణించాలంటే ఆ మాత్రం తెలివితేటలుండాలిలెండి!

మరింత సమాచారం తెలుసుకోండి: