ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ల మధ్య వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతున్నాయి. ఒకరి సినిమా ఆడియో ఫంక్షన్లకు మరొకరు వస్తూ తమ మధ్య ఎటువంటి వివాదాలు ఈగోలు లేవని చాలా వేదికల ద్వారా సినిమా ప్రపంచానికి చాటుతున్నారు. ఇప్పటికే చాలా సందర్భాలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అటువంటి వాతావరణం అందరం చూశాం. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి సడన్ సర్ ప్రైజ్ షాక్ ఇచ్చాడు నందమూరి బాలయ్య. సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు తెలుగు సినిమా ప్రేక్షకుల లో మెగా అభిమానులు వర్సెస్ నందమూరి అభిమానులు వాతావరణం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' అదిరిపోయే హిట్ అందుకోవడంతో ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో నందమూరి బాలయ్య బాబు పాల్గొనడం ఎప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.


ఇక్కడ విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఆ సినిమా సక్సెస్ పార్టీని ఇచ్చింది నందమూరి బాలకృష్ణ అవటం విశేషం. ఈ సందర్భంగా సినిమా అద్భుతంగా తీశారు అంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డిని మరియు అదే విధంగా హీరో చిరంజీవిని...బాలయ్య బాబు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. దీంతో నందమూరి మరియు కొణిదెల కుటుంబాల మధ్య ఆనందకరమైన సందడి వాతావరణం నెలకొంది. గత ఎన్నికల సందర్భంగా ఈ రెండు కుటుంబాల మధ్య భయంకరమైన రాజకీయ విమర్శలు చోటుచేసుకున్నాయి.


అయితే అవన్నీ పక్కన పెట్టి నందమూరి బాలకృష్ణ చొరవ తీసుకుని మెగా కుటుంబాన్ని అభినందించటం తో ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ పార్క్ హయత్ లో జరిగిన ఈ వేడుకలో బాలయ్యతో పాటు విక్టరీ వెంకటేష్- కృష్ణంరాజు సందడి చేశారు. చిరంజీవి- రామ్ చరణ్- సురేందర్ రెడ్డి- తమన్నా సైరా కోసం చేసిన శ్రమను.. సాహసాన్ని గుర్తుచేసుకున్నారు. టి.సుబ్బరామి రెడ్డి- మురళి మోహన్-అల్లు అరవింద్- శ్యామ్ ప్రసాద్ రెడ్డి- దిల్ రాజు- రఘురామ కృష్ణంరాజు తదితరులు సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. మొత్తం మీద బాలయ్య బాబు చిరంజీవి కి సర్ ప్రైజ్ షాక్ ఇవ్వడం జరిగింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: