తమిళనాడు అందరి నోట వినపడే పేరు అమ్మ .. అమ్మ అనే పేరు వారు ఎవరికి వాడుతారో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సీనియర్ నటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారు. ఈమె నటిగా అందరీ ఆదరణ పొందింది అనడం కంటే మంచి నాయకురాలిగా బాగా పెరు సంపాదించుకుంది. ప్రేమిస్తే ప్రాణమిస్తాము.. ద్వేషిస్తే ప్రాణం తిస్తాము అనేది అనే తమిళ తంబీల నినాదం అలాంటి వారిని కూడా తన ప్రేమతో మా ఎందరో అభిమానులను పోగేసుకుంది.


ఇకపోతే అమ్మ ప్రస్తుతం బౌతికంగా జనం మద్యలో లేదు .. కానీ జనాల గుండెల్లో మాత్రం అమ్మ చెరగని ముద్ర వేసుకుని నిలిచింది..ఆమెను అంబగా కొలుస్తూ వుంటారు .అమ్మ జీవిత ఆధారంగా ఓ సినిమా రాబోతుంది ఆ సినిమాలో ప్రముఖులు నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కు తలైవి గా టైటిల్ కూడా పెట్టారు. 


మరో విషయమేమిటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో ప్రముఖ పాత్రలో కనిపిస్తున్న వ్యక్తి కరుణానిధి..ఆయన పాత్రలో సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తూన్నారనే వార్తలు బాగా కోలీవుడ్లో వినపడుతున్నాయి.


అమ్మ జీవితంలో ముఖ్య వ్యక్తి  అయినటువంటి ఎంజీర్ పాత్రలో ప్రముఖ నటుడు అరవీంద్రస్వామి నటిస్తున్నారు.తమిళ్లో గతంలో ప్రకాష్ రాజ్.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువర్ సినిమాలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. దాదాపు 22  సంవత్సరాల తర్వాత మళ్ళీ తమిళ్ సి ఈ.ఆ నటించడం ఆయనకు సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది...కూల్ గా కనిపించే ప్రకాజ్ కరుణానిధి వంటి రాజకీయ వేత్త పాత్రలో నటించి ఏ మాత్రం పేరును సంపాదిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: