కథని సినిమాగా మలిచే దర్శకుల్లో మొదటి వరుసలో ఉండే పేరు శేఖర్ కమ్ముల. దర్శకులు అందరిదీ ఒక స్టైల్ అయితే...  శేఖర్ కమ్ములది మరో స్టైల్ . ఆయన సినిమా మేకింగ్ లోనే ఏదో మాయ చేస్తాడు. ఆయన సినిమా లో భారీ ఫైట్ లు ఉండవు... మితిమీరిన రొమాంటిక్ సీన్ లు ఉండవు . కేవలం కథే  సినిమాగా మారితే ఎలా ఉంటుందో అదే శేఖర్ కమ్ముల సినిమా . ఇక  శేఖర్ కమ్ముల  సినిమాలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండి  ప్రేక్షకులను సినిమాలో లీనం  చేస్తాయి. యూత్ ఇన్స్ ఫైర్  చేసే  ఎన్నో సినిమాలను శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విజయం సాధించాడు శేఖర్ కమ్ముల . ఎప్పుడు భిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కిస్తాడు   దర్శకుడు శేఖర్ కమ్ముల. 

 

 

 

 

 అందుకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అంటే ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని ప్రేక్షకులు భావిస్తారు. ఫామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని శేఖర్ కమ్ముల కథలను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అందుకే శేఖర్ కమ్ముల సినిమా వస్తుందంటే ఒక మంచి ఫ్యామిలీ సినిమా అని అందరూ భావిస్తారు. కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. 

 

 

 

 

 సినిమాలో కథానాయకుడిగా నాగచైతన్య నటిస్తుండగా నాగచైతన్య కు జోడిగా సాయి పల్లవి నటిస్తుంది . అయితే ఈ సినిమా  షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా  ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం శేఖర్ కమ్ముల ప్రకటించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ వరకు ఈ సినిమా పనులు పూర్తి కావని దీంతో డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేయడం సాధ్యపడదని సమాచారం. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతున్నప్పటికీ...  మిగతా పనులు జనవరిలో  కంప్లీట్ అవుతాయట. దీంతో  ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయాలని  చిత్రబృందం  అనుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: