బాలీవుడ్ లో వరస విజయాలతో దూసుకుపోతున్న మాస్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ రోహిత్ శెట్టి తాజాగా 'సూర్యవంశి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతేకాదు అదే వరుస విజయాల జోరుతో ఉన్న అక్షయ్ కుమార్ కూడా రోహిత్ శెట్టి కి తోడవడంతో మళ్ళీ ఈ ఇద్దరికి బ్లాక్ బస్టర్ పక్కా అని బాలీవుడ్ జనాలు ఫిక్సైపోయారు. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు రణవీర్ సింగ్.. అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఫిలిం మేకర్స్ విడుదల చేయగా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ ఫస్ట్ లుక్ లో అక్షయ్ కుమార్.. రణవీర్ సింగ్.. అజయ్ దేవగణ్ పోలీసు యూనిఫామ్ లో చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ గా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు పవర్ఫుల్ ఆఫీసర్ల నేపథ్యంలో దాదాపు ఇరవైమంది కమాండోలు బ్లాక్ యూనిఫాంలో ఏదో క్లిష్టమైన ఆపరేషన్ కోసం సిద్ధం అన్నట్టుగా మాస్కులు.. గన్స్ ధరించి ఉన్నారు. ఈ లుక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. 

ఇక చిత్ర బృందం రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ ఒక్కసారిగా 'సూర్యవం శి' పై ఆసక్తి రేపింది. రోహిత్ శెట్టి గతంలో అజయ్ దేవగణ్ తో 'సింగం'.. 'సింగం రిటర్న్స్' సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రణవీర్ సింగ్ తో 'సింబా' ను తెరకెక్కించాడు. ఇవన్నీ పోలీస్ స్టోరీలే. తాజగా ఈ 'సింగం' లోని బాజీరావు సింగం.. 'సింబా' లోని సంగ్రామ్ సింబా తో పాటు కొత్తగా అక్షయ్ కుమార్ పాత్ర వీర్ సూర్యవంశిని కలిపి 'ఆవెంజర్స్' తరహాలో ఒక కాప్ యూనివర్స్ ఫిలిం గా తెరకెక్కిస్తున్నాడు. ఆ క్రేజీ సినిమానే ఈ 'సూర్యవంశి'. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరో మాత్రం అక్షయ్ కుమార్ కావడం విశేషం. అజయ్.. రణవీర్ ఇద్దరివీ అతిథి పాత్రలేనని మరో లేటెస్ట్ అప్‌డేట్. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుండగా 2020 మార్చ్ 27 న రిలీజ్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: