శ్రీ మూవీ తో తెలుగు తెరకు పరిచమైన హీరోయిన్ మిల్క్
బ్యూటీ తమన్నా.. ఆ సినిమా మొదలుకొని చాలా సినిమాలలో నటిస్తూ వస్తుంది.. తెలుగుతో పాటుగా హిందీ , తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తూ తన హావను కొనసాగిస్తూ వస్తుంది. తెలుగులో అగ్రహీరోల సరసన కూడా ఈ మిల్కీ నటించింది. మంచి పేరును కూడా సంపాదించుకుంది..
కొత్త హీరోయిన్లకు పోటీగా తమ్మూ నటిస్తూ వస్తుంది.. తాజాగా ఈ
బ్యూటీ మెగాస్టార్ నటించిన
సైరా నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన
సైరా లో
చిరంజీవి ప్రేయసి గా నటించింది.. ఆ సినిమా మొన్న విడుదల అయింది..ఆ సినిమా మొదట వచ్చిన పబ్లిక్ రెస్పాన్స్ తో సినిమా అవుట్ అని అందరు అనుకున్నారు కానీ ఈ సినిమా మాత్రం అనుకోని రీతిలో ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరో విషయమేంటంటే ఈ సినిమాకు పోటీగా సినీ ఇండస్ట్రీలో మారె సినిమా లేకపోవడంతో ఈ సినిమా కు ప్లస్ అయిందనే చెప్పాలి.
వివరాల్లోకి వెళితే.. మొన్న బుధవారం ఈ సినిమా సక్సెస్ మీట్ పార్క్ హయాత్ లో ఏర్పాటు చేశారు. అందుకోసం ప్రముఖ సినీ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అక్కడ ప్రత్యేక ఆకర్షణగా తమన్నా ఓ వెలుగు వెలిగింది. ఇక పోతే ఆమె ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్..నేను ఇంతగా ఎంజాయ్ చేస్తున్నానంటే అది మీ వల్ల అంటూ పేరు పేరున సంబోదించింది.
ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను ముందు నుండి అనుకుంటూనే ఉన్న అలానే జరిగింది. నాకు సపోర్ట్ చేసిన సాయిరాం టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని మిల్కీ చిత్ర యూనిట్ ని పొడగ్తలతో ముంచేసింది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేశ్,
జీవిత రాజశేఖర్ దంపతులు,
వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, కేథరిన్, నిహారిక, అశ్వినీదత్, బోనీకపూర్,
సురేష్ బాబు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్,సుకుమార్,
అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్ మొద;అగు వారు హాజరయ్యారు.