తమిళ  హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ  'అసురన్'  ఇటీవల విడుదలై  సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద  అదరగొడుతుంది.  తమిళనాడు వ్యాప్తంగా కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం  30కోట్ల గ్రాస్ వసూళ్లను  రాబట్టి  సత్తా చాటింది.  ఇక చెన్నై లో ఈ చిత్రం మొదటి వారం లో 3.30కోట్ల వసూళ్లను రాబట్టగా  కేరళ లో 2కోట్ల గ్రాస్ తో అదుర్స్ అనిపించింది.  ఇప్పటికే ఈ చిత్రం చాలా ఏరియాల్లో  బ్రేక్ ఈవెన్  అయ్యింది. దాంతో ఫుల్ రన్ లో అసురన్  బయ్యర్లకు  భారీగా లాభాలను తీసుకొచ్చి  కోలీవుడ్ లో ఈఏడాది  బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా  నిలవడం  ఖాయం గా కనిపిస్తుంది. 


రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ నటన  హైలైట్ గా నిలిచింది.  వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన  ఈ చిత్రంలో మలయాళ నటి  మంజు వారియర్ ,ధనుష్ కు జోడీగా నటించగా   జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.   ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత  కలైపులి ఎస్ థాను నిర్మించాడు.  ధనుష్ - వెట్రిమారన్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.  ఇంతకుముందు  వీరి కాంబినేషన్ లో వచ్చిన  వడ చెన్నై కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది. ఇక  ధనుష్  ప్రస్తుతం , దొరై సెంథిల్ కుమార్  డైరెక్షన్ లో పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.  ఈచిత్రంలో  స్నేహ  ఓ కీలక పాత్రలో నటిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర  విలన్ పాత్రలో  కనిపించనున్నాడు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈఏడాది  డిసెంబర్ లో విడుదలకానుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: