తెలుగులో ఉన్న యంగ్ హీరోల్లో దశాబ్ద కాలం నుండి ఉన్న హీరో నితిన్. నితిన్ తన మొదటి సినిమా "జయం"తో ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. ఆ తర్వాత నితిన్ కి మంచి మంచి చిత్రాలే వచ్చాయి. వివి వినాయక్ తో దిల్ సినిమా, రాజమౌళితో "సై" సినిమా లు అతనికి యూత్ లో క్రేజ్ ని తెచ్చి పెట్టాయి.


అయితే ఆ తర్వాత నితిన్ కి కాలం కలిసిరాక చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. చాలారోజుల తర్వాత "ఇష్క్"  సినిమా అతని కెరియర్ ని నిలబెట్టింది. అప్పటి నుండి అతని కథల సెలక్షన్లలో కుడా చాలా మార్పులు వచ్చాయి. ఇష్క్ అయ్యాక గుండె జారి గల్లంతయ్యిందే ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇలా వరుసగా విజయాలు వస్తున్న అప్పుడప్పుడు ఫ్లాపులు కూడా పలకరిస్తున్నాయి. అయినా ఏ ఆటంకం లేకుండా కెరియర్ సాఫీగా సాగిపోతుంది.


తాజాగా నితిన్ భీష్మ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా అవ్వకముందే నితిన్ తో మరో సినిమాని ప్లాన్ చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఈ సినిమాకి "రంగ్ దే" అనే టైటిల్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇంత సడెన్ గా మరో సినిమా మొదలు పెట్టడానికి కారణం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు.


అయితే నితిన్ భీష్మ తర్వాత మరో రెండు కథల్ని చేయాలని అనుకున్నాడట. ఒకవేళ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలగజేసుకోకపోతే ఆ కథలకి ఓకే చెప్పేవాడట. దాంతో మళ్ళీ అతనితో సినిమా చేయాలంటే చాలా సమయం అవుతుందని గ్రహించి ముందే షూటింగ్ స్టార్ట్ చేయాలని భావించారట. భీష్మ రిలీజ్ అయ్యేనాటికే "రంగ్ దే" మొదటి షెడ్యూలు కుడా పూర్తవుతుందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: