రాజమౌళి ఏ సినిమా చేసిన అది సక్సెస్స్ తో పాటు సెన్సేషన్ అవ్వడం గారంటీ... ఒక ఛత్రపతి., ఒక ఈగ., ఒక బాహుబలి., ఒక ట్రిపుల్ ఆర్..,,

బాహుబలి లాంటి భారీ విజయం తరువాత జక్కన్న చెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR. ఈ సినిమా ప్రకటించిన నాటినుంచే తన దర్శకత్వ ప్రతిభ మరోసారి చూడబోతున్నామనే ఉత్సాహం ప్రేక్షక మదిలో నెలకొంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న సినిమా రెండు వర్గాల ప్రేక్షకులకు ఆనందాన్నిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ సమ ప్రాధాన్యమున్న రోల్స్ ఇచ్చారని.., అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. చారిత్రక నేపథ్యంతొ ఇద్దరి క్యారెక్టర్స్ ని రాజమౌళి తీర్చిదిద్దుతున్న విధానం ప్రేక్షకుల మెప్పు పొందటం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

RRR సినిమాలో నటిస్తూనే తండ్రి మెగాస్టార్ నటించిన సైరా నిర్మాణ పనులు చూసుకున్నారు చరణ్. తండ్రికి కానుకగా ఇస్తున్న సినిమా కావడంతో సైరా పనులపై ప్రత్యేక శ్రద్ద పెట్టిన చరణ్ RRR సెట్స్ కి కాస్త దూరంగానే ఉన్నారు. అందుకోసం రాజమౌళి కూడా రామ్ చరణ్‌కు కొంత స్వచ్ఛ నిచ్చారని., సైరా పనులన్నీ పూర్తిచేసుకొని భారీ రేంజ్‌లో విడుదలైన తర్వాత చరణ్ ఫ్రీ అవడంతో RRR సెట్స్ పై చురుకుగా పాల్గొనబోతున్నట్టు సమాచారం.

రామ్ చరణ్ సైరా పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు.., అలా ఇన్నాళ్లు RRR సెట్స్ మీద జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు చెర్రీ రాకతో కొన్ని రోజుల పాటు ప్రాజెక్ట్‌కి దూరంగా ఉండాలని., ఎలాగూ ఎన్టీఆర్ కు సంబంధించిన సన్నివేశ చిత్రీకరణ దాదాపు పూర్తి అవడంతో.., ఇన్నాళ్లు RRR షూట్ తో బిజీ బిజీగా గడిపిన ఎన్టీఆర్.. కొన్ని రోజులు తన కుటుంబంతో గడపడానికి టూర్ ప్లాన్ చేస్కున్నట్లు టాక్.

డివివి దానయ్య సమర్పణలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో RRR తెరకెక్కనుంది. 2020 జులై 30న ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇక ఈ చిత్రానికి "రామ రౌద్ర రుషితం" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: