విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్  నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ వెంకీమామ.  నిజ జీవితంలో  మామ, అల్లులు అయిన వీరిద్దరు  ఈసినిమాలోకూడా  ఆ పాత్రల్లోనే కనిపించనున్నారు. ఇక ఈచిత్రాన్ని  మొదటగా దసరా బరిలో నిలుపాలనుకున్నారు కానీ కుదర్లేదు. అయితే దసరా మిస్ కావడంతో  దీపావళిని టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు  ఆ సమయానికి సినిమా విడుదలకావడం లేదు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడమే అందుకు కారణం. 




ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఓ భారీ సెట్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దాంతో సినిమా షూటింగ్  పూర్తి కానుంది. ఆతరువాత  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరిపి చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారం లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై లవకుశ  ఫేమ్  బాబీ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో  వెంకటేష్ కు  జోడిగా  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ , నాగ చైతన్య  కు జోడిగా  రాశీ ఖన్నా నటిస్తున్నారు. సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.   ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాలు  సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా పై మంచి అంచనాలను తీసుకొచ్చాయి. ఇక ఇటీవల  ఎఫ్ 2 తో  బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి వెంకీ ఫామ్ లోకి రాగ మజిలీ తో నాగ చైతన్య సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మరి ఇప్పుడు ఈ వెంకీమామ వీరిద్దరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: