2011లో వచ్చిన కెరటం అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్, ఆ సినిమా పెద్దగా విజయం సాదించకపోవడంతో, తన రెండవ సినిమాకు కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా సక్సెస్ తో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. అయితే ఆ సినిమా సక్సెస్ తరువాత ఆది హీరోగా వచ్చిన రఫ్, ఆపై గోపీచంద్ హీరోగా వచ్చిన లౌక్యం సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ సంపాదించింది. అయితే అందులో లౌక్యం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నుండి మెల్లగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు సంపాదించిన ఈ భామ, ఆ తరువాత నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, 

పండగ చేస్కో, రారండోయి వేడుక చూద్దాం వంటి హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల ఆమె నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో, ఆమెకు ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు పెద్దగా లేవు. అలానే మరోవైపు తమిళ నాట కూడా రకుల్ కు కొన్నాళ్లుగా ఫ్లాప్సే పలకరిస్తున్నాయి. అయితే అక్కడ ప్రస్తుతం ఆమెకు శంకర్ మరియు కమల్ హాసన్ ల కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2, అలానే శివ కార్తికేయన్ సరసన మరొక సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు దక్కాయి. మరోవైపు ఆమె బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అయితే తనకు ఇక్కడ అవకాశాలు తగ్గడం పై ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో రకుల్ మాట్లాడుతూ, 

నిజానికి తాను కెరీర్ మొదట్లోనే మంచి హిట్స్ దక్కించుకోవడం వలన ప్రేక్షకుల్లో హీరోయిన్ గా మంచి పేరొచ్చిందని, కానీ అదే సమయంలో వచ్చిన అవకాశాలు అన్నీ ఒప్పుకోవడం వల్లనే తనకు కొన్ని ఫ్లాప్స్ కూడా రావడం జరిగిందని, అందుకే ఇక్కడ ప్రస్తుతం తనకు పెద్దగా చాన్సులు రావడం లేదని దిమ్మతిరిగే సమాధానము ఇచ్చింది. ఇక హిందీలో రణ్వీర్ తో అలానే తెలుగులో విజయ్ దేవరకొండతో సినిమాలు చేయాలని ఉందని అంటోంది రకుల్....!!


మరింత సమాచారం తెలుసుకోండి: